నోముల భగత్ ను గెలిపించాలి: ఎన్నారై టీఆర్ఎస్

229
nri
- Advertisement -

నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ని గెలిపించాలని విజ్ఞప్తి చేసింది ఎన్నారై టీఆర్ఎస్. హాలియాలో ఎన్నారై తెరాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల మరియు సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన , మల్లేష్ పప్పుల , శ్రీనివాస్ వల్లాల పాల్గొన్నారు. 

అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపుకోసం దాదాపు రెండు వారాలకు పైగా వివిధ మండలాల్లో ఎన్నారై తెరాస బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించామని, సాగర్ నియోజకవర్గ పరిధిలో కెసిఆర్ గారి నాయకత్వం లో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రత్యేక కరపత్రం ద్వారా గడప గడపకు తెలిసేలా విస్తృత ప్రచారం చేశామని అనిల్ కూర్మాచలం తెలిపారు.

నేడు కెసిఆర్ గారి పాలన దేశానికే ఆదర్శంగా ఉందని , ఒక పక్క సంక్షేమం అభివృద్దే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని టీ .యస్ – ఐ పాస్ లాంటి పాలసీలే కాకుండా కేటీఆర్ విదేశాలకు వెళ్లి మన రాష్ట్రానికి పెట్టుబడుల్ని తేవడానికి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.  యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచాలనే స్పూర్తితో తెరాస ప్రభుత్వం కెసిఆర్ గారు పని చేస్తున్నారని తెలిపారు.

మరి ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉన్నది. నేడు సాగర్ లో భగత్ గెలుపుతో నియోజకవర్గం రెట్టింపు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని. నోముల నర్సింహయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మీ ముందుకు వచ్చాడని ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపితే మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాడని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ ఢిల్లో లేదు గల్లీ లో లేదని వారికి పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధా అవుతుందని ఓటరులంతా విజ్ఞతతో ఓటేసి కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, 17 వ తేదీన జరిగే పోలింగ్ లో నోముల భగత్ గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపియ్యాలని విజ్ఞప్తి చేశారు.  

 ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాల నుండి సాధారణ ఎన్నికల్ల నుండి ఉపఎన్నికల వరకు మున్సిపాలిటీ నుండి పార్లమెంట్ వరకు దాదాపు ప్రతీ ఎన్నికల్లో అటు సోషల్ మీడియా ద్వారా ఇటు ప్రత్యక్షంగా బృందంగా వచ్చి బాధ్యత గల తెరాస నాయకులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, అదే స్పూర్తితో గత కొన్ని వారాలుగా సాగర్ నియోజికవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో విసృంతంగా పర్యటించి ప్రచారం నిర్వహించామని ప్రజలంతా తెరాస వైపే ఉన్నారని, ప్రత్యర్ధులు చివరి నిముషం వరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుందని కానీ ప్రజలంతా విజ్ఞత తో ఓటేసి నోముల భగత్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -