ఇప్పుడు ఎన్టీఆర్ వంతు !

206
- Advertisement -

ప్రెజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ హవా నడుస్తోంది. ఒక్కడు , పోకిరి లతో మొదలైన రీ రిలీజ్ హంగామా నెలకి రెండు మూడు సినిమాలతో కంటిన్యూ అవుతూనే ఉంది. మహేష్ సినిమాలకు మంచి కలెక్షన్స్ వాచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా కూడా రీ రిలీజ్ చేసి 4k డాల్బీ లో ప్రదర్శించారు. ఆ సినిమాకు కూడా మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమ్ముడు కూడా వన్ డే మంచి వసూళ్ళు అందుకుంది. ఇన్నేళ్ళ తర్వాత రీ రిలీజ్ అయినప్పటికీ పోకిరి , జల్సా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి.

అయితే మొన్నీ మధ్యే ప్రభాస్ ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలు కూడా వేసుకున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. బిల్లా ని గట్టిగా ప్రమోట్ చేయడంతో పైగా ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సినిమాను బాగానే చూశారు. దీంతో బిల్లా కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ వర్షం కి ఆశించిన ఫలితం రాలేదు. మహేష్ , పవన్ , ప్రభాస్ ఇలా వరుసగా రీ రిలీజ్ సినిమాలతో హంగామా చేశారు.

ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. నవంబర్ 19 న ఎన్టీఆర్ ‘బాద్ షా’ రీ రిలీజ్ అవ్వబోతుంది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో జస్ట్ సూపర్ హిట్ అనిపించుకుంది. కాకపోతే ఇందులో కామెడీ కి ఫ్యాన్స్ ఉన్నారు. పద్మనాభ సిన్హా కేరెక్టర్ తో బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్. తమన్ పాటలు కూడా సూపర్ హిట్. మరి ఇవన్నీ కలిసి బాద్ షా రీ రిలీజ్ లో మంచి వసూళ్ళు అందుకొని మహేష్ , పవన్ , ప్రభాస్ రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ స్థాయిని అందుకుంటుందా ? లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే బుకింగ్స్ ఆశించిన స్థాయిలో అయితే లేవు.

ఇవి కూడా చదవండి..

పవన్ గురించి హరీష్ శంకర్ ట్వీట్… అందుకేనా ?

వైరలవుతున్న ఆలనాటి జ్ఞాపకం కానీ…

వీళ్ల మధ్య …15ఏళ్ల అనుబంధం

- Advertisement -