‘పుష్ప’ పై శివాని రాజశేఖర్ కామెంట్స్

261
- Advertisement -

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప కి రిలీజ్ తర్వాత ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. నార్త్ ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. క్రికెటర్స్ సైతం పుష్ప మేనరిజం గట్టిగా వాడుతున్నారు. ఇక ఇటివల దర్శకుడు తేజ తెలుగులో పుష్ప కి ఆశించిన విజయం రాలేదని వ్యాఖ్యానించారు. పుష్ప పై తేజ కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. తర్వాత మళ్ళీ ఆయన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా ఈ క్రేజీ సినిమాపై రాజశేఖర్ కూతురు హీరోయిన్ శివాని కూడా ఓ కామెంట్ చేసింది. అయితే శివాని కామెంట్ చేసింది మీడియా ముందు కాదు , ఇంటర్వ్యూ లోనూ కాదు తను నటించిన వెబ్ సిరీస్ లో. రాజ్ తరుణ్ తో కలిసి శివాని ‘అహనా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో ఓ సందర్భంలో రాజ్ తరుణ్ తో తనకు కాబోయే భర్త గురించి అతని ఇష్టాఅయిష్టాల గురించి చెప్తూ “నాకు పుష్ప ఫస్ట్ హాఫ్ నచ్చింది తనకి సెకండాఫ్ నచ్చింది” అంటూ కామెంట్ చేసింది.

నిజానికి పుష్ప విషయంలో చాలా మందికి ఈ డిబేట్ ఉంది. తెలుగులో కొందరికి ఫస్ట్ హాఫ్ నచ్చింది ఇంకొందరికి సెకండాఫ్ నచ్చింది. బహుశా ఆ మాటలను దర్శకుడు ఈ సిరీస్ లో సరదాగా శివానితో చెప్పించి ఉండొచ్చు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పుష్ప 2 గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈసారి సుక్కు నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకా బెటర్ మాస్ కంటెంట్ ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

ఇప్పుడు ఎన్టీఆర్ వంతు !

పవన్ గురించి హరీష్ శంకర్ ట్వీట్… అందుకేనా ?

విజయ్ దేవరకొండ …ఒక మంచి పని !

- Advertisement -