భయం వద్దు.. గ్యాస్ సిలిండర్ల నిల్వలున్నాయి..

344
ioc
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో ఎల్.పీ.జీ గ్యాస్ సిలిండర్లు సరిపడా నిల్వలున్నాయని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి ఇప్పిలి రమ .

అనవసర భయంతో, అవసరం లేకున్నా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయవద్దని తెలిపారు. జిల్లాలో ఎల్.పీ.జీ వినియోగదారులు భయం తో బుకింగ్ చేయవద్దని, రీఫిల్స్ లకై స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల షోరూం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇండియన్ ఆయిల్ ఎల్.పీ.జీ షోరూం షాప్, గోదాం కీపర్, ఎల్.పీ.జీ మెకానిక్ లు, డెలివరీ బాయ్స్, ట్రాక్ డ్రైవర్లు లందరు ప్రస్తుత కరొన వైరస్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులలో పాల్గొంటున్నారని రమ ప్రశంసించారు. వీరందరిలో ఎవరైనా దురదృష్టవశాత్తు కరొన వాళ్ళ మరణిస్తే ఐదు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా క్రింద అందచేయనున్నటు ఇండియన్ గ్యాస్ రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా వినియోగదారులు కరెన్సీ నోట్లను ఇవ్వడానికి బదులుగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత నివ్వాలని ఆమె సూచించారు. జిల్లాలోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వచ్చే మూడునెలలు మూడు సిలిండర్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున, ఒక్కొక్క వినియోగదారుడికి నెలకు ఒక్క సిలిండర్‌ని మాత్రమే ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు.

- Advertisement -