నో పీయూసీ… నో ప్యూయల్‌ :ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌

74
- Advertisement -

దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెల్లుబాటు అయ్యే పొల్యూషన్‌ అండర్‌ సర్టిఫికెట్‌(పీయూసీ) చూపించకుంటే పెట్రోల్‌ బంకుల్లో చమురు పోసేదే లే అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌ స్పష్టం చేశారు. అక్టోబరు 25 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని చెప్పారు.

పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

2022 జులై నాటికి ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం సుమారు 13 లక్షల ద్విచక్రవాహనాలు, 3లక్షల కార్లు పీయూసీ సర్టిఫికెట్‌ లేకుండానే దేశ రాజధాని రోడ్లపై సంచరిస్తున్నాయన్న తెలిపారు.

నో పీయూసీ … నో ప్యూయల్‌పై ఈ ఏడాది మార్చి 3న ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని ఎక్కువ మంది దీన్ని అమలుకు మొగ్గు చూపడంతో ఈ విధానం తీసుకొస్తున్నామని రాయ్‌ వెల్లడించారు. అయితే గతంలో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానం వల్ల వాహనాలను రోడ్లపైకి రాకుండా చేసింది.

- Advertisement -