సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కు మెగాస్టార్..బన్ని ఎమన్నాడంటే?

573
Allu Arjun Chiranjeevi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈచిత్రం విడుదల కానుంది. ఈసందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఈ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇదిలాఉండగా జనవరి 12న అల్లు అర్జున్ నటించిన అల..వైకుంఠపురంలో విడుదల కానుంది.

ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కు ఛీప్ గెస్ట్ గా ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ గెస్ట్ లు ఎవరు రారని తెలుస్తుంది. అల..వైకుంఠపురంలో ఆడియో వేడుకకు గెస్ట్‌లను ఎవరినీ పిలవవద్దని బన్నీ తెలిపాడట. సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ కి చిరంజివి వెళ్తుండటంతో . ఆయన మీద గౌరవం, ప్రేమ, అభిమానం దృష్ట్యా ‘అల వైకుంఠపురములో..’ వేడుకకు ఏ గెస్ట్‌ను ఆహ్వానించ వద్దు..వేరేవాళ్లను పిలిచి ఆయన స్ధాయిని తగ్గించవద్దు అని చిత్రయూనిట్ తో చెప్పాడట అల్లు అర్జున్.

- Advertisement -