అలా జరుగుతుందనే పిల్లలు వద్దనుకున్నాః విజయశాంతి

647
vijayashanthi new
- Advertisement -

13సంవత్సరాల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసందర్భంగా ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పింది. అందరిలాగే తనకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అని కానీ పిల్లలను కంటే తనలో స్వార్ధం పెరుగుతుంది చెప్పింది. అందుకోసమే తాము పిల్లలు వద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Vijayashanthi

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ‘నా’ అన్న స్వార్థం స్థానంలో, ‘మన’ అన్న ధోరణితో సాగాలని భావించానని, తనను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకు తన భర్త శ్రీనివాస ప్రసాద్ నుంచి ప్రోత్సహం లభించిందని, ఇద్దరం కలిసే పిల్లలు వద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. శ్రీనివాస ప్రసాద్ తో అనుకోకుండా పరిచయం ఏర్పడిందని..ఒకరి అభిప్రాయాలు మరోకరితో పంచుకున్నాకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమ పెళ్లి చాలా సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేసుకున్నామని..ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం ఉందని చెప్పింది. ప్రస్తుతం తనకు రాజకీయాలే ముఖ్యమని..వరుసగా సినిమాలు చేసే ఉద్దేశం లేదని, కథ బాగుంటే ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువ చేసే అవకాశం లేదని తెలిపింది.

- Advertisement -