కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న చర్చలకు ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలతో తెరపడిందని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర అన్నారు.
కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ప్రస్తుతమున్న వ్యవస్థే కొనసాగుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన పరమేశ్వర, “అధిష్టానమే స్పష్టత ఇచ్చాక, ఈ అంశంపై చర్చకు ఇక స్వస్తి పలకాలి (Full Stop)” అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పు లేదా అదనపు ఉప ముఖ్యమంత్రుల నియామకంపై రాష్ట్ర రాజకీయాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఖర్గే ప్రకటనతో ఆ గందరగోళం తొలగిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం స్థిరంగా ఉందని, ఇప్పుడు అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి మరియు పాలనపై దృష్టి సారిస్తామని పరమేశ్వర తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Also Read:May Day:ప్రపంచ కార్మిక దినోత్సవం
లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని అధిష్టానం సూచించిందని, దాని ప్రకారం ముందుకు సాగుతామని ఆయన వివరించారు.మొత్తానికి, కర్ణాటక కాంగ్రెస్లో “నాయకత్వ మార్పు” అనే అంశానికి ప్రస్తుతానికి అధిష్టానం ముగింపు పలికినట్లు కనిపిస్తోంది.

