త్వరలో టీఆర్ఎస్‌లోకి చేరికలు:కవిత

275
- Advertisement -

నిజామాబాద్‌ నగరంకు చెందిన 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవిత ఆద్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ ఆర్బన్ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల సమక్షంలో పార్టీలో చేరిన ఆకుల హేమలతకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ చేసే పేదల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రగతి సాధిస్తుందని అని తెలిపారు. భవిష్యత్ లో ఇతర పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

పెట్టుబడులకు స్వర్గధామం:కేటీఆర్‌

కన్నతల్లిని జన్మభూమిని మరువద్దు…సంతోష్‌

15రోజుల్లో..బన్సీలాల్‌పేట మెట్లబావి పూర్తి

- Advertisement -