మొక్కలు నాటిన నిర్మల్ కలెక్టర్‌ ముషారఫ్..

245
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖ్. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ కుమార్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి నిర్మల్ కలెక్టరేట్ లో మొక్కలు నాటారు .

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి , వాటిని సంరక్షించి ఎదిగేలా , పర్యావరణ పరిరక్షణపైనా మంచి అవగాహనా కల్పిస్తుంది . హరితహరం కి మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజవంతకొనసాగుతుంది అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. తన జిల్లాలో ఈ కార్యక్రమం ఒకరి ద్వారా మరొకరికి చేరేలా , ప్రతి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే విదంగా చేస్తా అన్నారు.

- Advertisement -