అమిత్‌ షాకు కరోనా టెస్టు చేయలేదు: కేంద్రం

265
amith shah
- Advertisement -

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్ధితిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను కేంద్రం కొట్టిపారేసింది. అమిత్‌ షాకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని ఈ మేరకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అసలు అమిత్ షాకు కరోనా పరీక్షలే నిర్వహించలేదని…కేంద్ర హోంశాఖ తెలిపింది.ఒకవేళ ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే ఆ వివరాలు తామే వెల్లడిస్తామని హోంశాఖ కార్యాలయం పేర్కొంది.

అమిత్ షా ఆగస్టు 2న పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ అని తేలడంతో వైద్యుల సలహా మేరకు హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం గుర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అమిత్ షా తర్వాత ఆరుగురు కేంద్ర మంత్రులు కూడా కరోనా బారినపడ్డారు.

- Advertisement -