తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట: మంత్రి నిరంజన్ రెడ్డి

259
minister niranjan reddy
- Advertisement -

ఐకార్ (జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి) ప్రాంతీయ కమిటీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేందర్ సింగ్ తోమర్, ఐకార్ డీజీ త్రిలేచన్ మహాపాత్ర, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వీసీ ప్రవీణ్ రావు తదితరులు, వివిధ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నాం. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనిలో కీలకపాత్ర పోషిస్తుంది.తెలంగాణలో నియంత్రిత సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న పంటలసాగు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు కష్టానికి తగిన ఫలితం, మద్దతుధర లభించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. 53 లక్షల ఎకరాలలో వరి, దాదాపు 60 లక్షల ఎకరాలలో పత్తి, 11 లక్షల ఎకరాలలో కందితో పాటు ఆముదాలు, జొన్నలు, సోయాబీన్, వేరుశనగ సాగు చేయడం జరిగింది. మొత్తం కోటి 45 లక్షల ఎకరాలలో ఈ వానాకాలంలో తెలంగాణలో పంటలు సాగవుతున్నాయి.. యాసంగిలో కూడా గతం కన్నా ఎక్కువ శాతం సాగవుతాయి.

ఆవాల పంటపై అఖిల భారత పరిశోధన సమన్వయ కేంద్రం జగిత్యాలలో అనుమతించండి అని మంత్రి కోరారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహిస్తున్నాం. అంతర్జాతీయ నాణ్యత కలిగిన అప్లాటాక్సిన్ రహిత వేరుశనగ పండే వనపర్తి జిల్లాలో వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలి. పత్తిలో అత్యధిక సాంద్రంతతో పంట పండించేందుకు అఖిల భారత పరిశోధన సమన్వయ కేంద్రం వరంగల్ లో ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతుల దృష్ట్యా నీటి యాజమాన్యంపై పరిశోధన చేయటానికి రాజేంద్రనగర్‌లో అఖిల భారత సమన్వయ కేంద్రం ఏర్పాటు చేయాలి. నీటి వసతితో రైతులు రెండవ పత్తి పంట పండించేందుకు అవకాశాలను శాస్త్రవేత్తలు శోధించాలని మంత్రి సూచించారు.

- Advertisement -