ఢిల్లీ బాంబు పేలుడు..ఎన్‌ఐఏ దర్యాప్తు!

154
delhi
- Advertisement -

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఉగ్ర కార్యకలాపాలు, బాంబు దాడుల కేసుల దర్యాప్తును చేపడుతోంది ఎన్ఐఏ. ఢిల్లీ స్పెషల్ సెల్ దర్యాప్తులో ఉన్న ఈ పేలుడు కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఐబి, స్పెషల్ సెల్ అధికారులతో ఎన్ఐఏ సీనియర్ అధికారులు టచ్ లో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -