మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో డబుల్ బెడ్‌ రూమ్ ..

184
minister
- Advertisement -

మంత్రి కే. తారక రామారావు ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామికి 2బిహెచ్ కే మంజూరు చేసి ఆ యూనిట్ కాస్ట్ మేరకు ఐదు లక్షల నాలుగు వేల చెక్కును అంశాల స్వామికి అందించారు నల్గొండ జిల్లా కలెక్టర్. నిన్న ప్రగతి భవన్ లో అంశాల స్వామి మంత్రి కే తారకరామారావు ని కలిశారు. ఈ సందర్భంగా అంశాల స్వామికి 2బిహెచ్ కే అందిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఈ విషయాన్ని నల్గొండ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్వామి సొంతింటి కలను నెరవేర్చారు. దీంతో స్వామి ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -