వెదురు సాగుతో ఎన్నో లాభాలు: నిరంజన్ రెడ్డి

201
niranjan reddy
- Advertisement -

వెదురుసాగుతో ఎన్నో లాభాలున్నాయని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో గ్రో – మోర్ బయోటెక్ లిమిటెడ్ వెదురు పరిశోధన కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో కలిసి సందర్శించారు. దేశం ఏటా 7 లక్షల 200 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుందన్నారు. దేశంలో 50 లక్షల ఎకరాలలో వెదురు సాగుతో ఇథనాల్ తయారుచేయడం మూలంగా మన ఇంధన అవసరాలు తీరుతాయన్నారు.

గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ అధినేత, ప్రఖ్యాత వెదురు శాస్త్రవేత్త భారతి అనుభవం వెదురు సాగులో ఉపయోగించుకోవాలన్నారు. గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ సందర్శన, భారతి అనుభవం విన్న తర్వాత స్వయంగా వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నా .. ఇక్కడి టిష్యూకల్చర్ విభాగం చాలాబాగుందన్నారు. భీమా బంబూ ఇథనాల్ (బ్లెండ్) తయారీకి అనుకూలం అన్నారు.

వెదురు ఒక్కసారి నాటితే 60, 70 ఏళ్లు దిగుబడి .. నాలుగో ఏడాది నుండి దిగుబడి ప్రారంభం అవుతుందన్నారు. ఎకరాకు ఏడాదికి 40 టన్నుల దిగుబడి .. టన్నుకు రూ.4500 లు ధర ఉంటుందన్నారు. ఏడాదికి రూ.లక్షా 20 వేల నుండి రూ.లక్షా 60 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు.

- Advertisement -