మంత్రి కొప్పులకు శుభాకాంక్షలు వెల్లువ..

134
minister koppula
- Advertisement -

హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ,దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్,ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి షఫీవుల్లా,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, జాయింట్ డైరెక్టర్ హన్మంతు నాయక్,మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కాంతి వెస్లీ,ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్,దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి శైలజ, అడిషనల్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్,మాల మహానాడు అధ్యక్షుడు తలమళ్ల హుస్సేన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -