పూర్వ జన్మలో రాజు.. ఈ జన్మలో ఆటో డ్రైవర్‌.. కోట కోసం తవ్వకాలు..

255
Sundari Kannan
- Advertisement -

తమిళనాడులో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడు, తిరునల్వేలి ప్రాంతానికి చెందిన సుందరీ కన్నన్ అనే వ్యక్తి గత జన్మలో శ్రీ వైకుంఠం ప్రాంతాన్ని పరిపాలించిన రాజును తానేనని చెబుతూ సంచలనం రేపాడు, అంతేకాదు ఆ ప్రాంతంలో తన కోట, గట్టించిన గుడి ఉందని చెబుతూ, తవ్వకాలు జరిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక్కడికి సమీపంలోని రెడ్డియార్ పట్టి ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా ఉన్న 47 ఏళ్ల సుందరీ కన్నన్, తనకు కొన్ని రోజులుగా పూర్వ జన్మ స్మృతులు గుర్తుకు వస్తున్నాయని చెబుతున్నాడు. తాను రాజుగా ఉన్న సమయంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మాణం జరిగిందని చెప్పాడు. తాను కొంగరాయకురిచ్చి ప్రాంతంలో భారీ ఆలయాన్ని కట్టించానని చెప్పాడు. ఈ ప్రాంతంలోనే ఆలయం భూమిలో కూరుకుపోయిందని చెబుతున్నాడు.

ఈ నేపథ్యంలో శనివారం నలుగురు కార్మికులను నియమించి ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించాడు. తహసీల్దార్‌ గోపాలకృష్ణన్‌ తవ్వకాలను అడ్డుకున్నారు. పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు జరపటం నేరమంటూ సుందరీ కన్నన్‌ను తీవ్రంగా మందలించారు. సుందరీ కన్నన్‌ మాట్లాడుతూ.. గత జన్మలో రాజుగా ఉన్నప్పుడు రాణితో కలిసి బృహదీశ్వరాలయ తొలి కుంభాభిషేకానికి వెళుతుండగా తనను ప్రేమించిన పనిమనిషి విషాహారం పెట్టి హత్య చేసిందని చెప్పాడు.

- Advertisement -