జూ పార్క్‌కు ISO సర్టిఫికేషన్.. సిబ్బందికి మంత్రి ప్రశంసలు..

364
minister ik reddy
- Advertisement -

నెహ్రు జూలోజికల్ పార్కు, హైదరాబాద్‌కు ఐ.ఎస్‌.ఓ 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్‌ స్టాండర్స్‌ సర్టిఫికేషన్‌ ప్రధానం చేశారు. నెహ్రూ జూ పార్క్ కు ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ ఇచ్చారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు ఈ సర్టిఫికేట్‌ ప్రధానం చేశారు. దేశంలో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేస్ అందుకున్న మొదటి జూ పార్కు నెహ్రు జూలోజికల్ పార్కు. ఈ సర్టిఫికేట్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రు జూలాజికల్ పార్కు ఐఎస్‌ఓ 9001: 2015 క్వాలిటీ మేనేజ్మెంట్‌ సర్టిఫికేషన్‌ పొందడం ఎంతో హర్షణీయం అన్నారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జూ పార్కులో ప్రతీ విభాగంలో పాటించబడుతున్న ఐఎస్‌ఓ ప్రమాణాలను గుర్తించి వారికి ఈ సర్టిఫికెట్ ప్రధానం చేయటం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ మేంటెనెన్స్‌, ఎస్టాబ్లిషమెంట్ లను ఈ క్రింది నిపుణుల బృందం తనిఖీ చేసింది.

1.టీ సుందరరామయ్యా , (రిటైర్డ్‌ జిల్లా జడ్జి)

  1. సీ. మధు బాబు , ఆడిటర్‌
  2. శివయ్య అలపాటి, సర్టిఫికేషన్‌ ఆడిటర్‌

ఈ బృందం అన్ని విషయాలతో పాటు, వివిధ విభాగాల్లో పాటిస్తున్న ప్రమాణాలను కూడా పరిశీలించింది. జూ సిబ్బంది సమర్థవంతంగా, అంకితభావంతో పనిచేయటం, జంతువుల పట్ల మానవతా దృక్పధంతో సేవలందించుట నిపుణులకు బాగా నచ్చిన విషయాలు. రిటైర్డ్ జడ్జి సుందరామయ్య ముఖ్యంగా జూలోని అధికారుల యొక్క మార్గదర్శనం వారి నాయకత్వాన్ని ప్రశంసించటం జరిగింది.

ప్రతి పనిలో పారదర్శకత, 24 గంటల అన్ని అత్యవసర పరిస్థితులలో సిబ్బంది స్పందించే విధానం గొప్పగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ సమాచారాన్ని, గణాంకాలను యూకే అక్రిడియేషన్ వారికి పంపించి, నెహ్రు జూలోజికల్ పార్కు ఈ ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికేట్‌ పొందటానికి చాలా ఖచ్చితమైన సిఫార్సు పంపటం జరిగింది.

యూకే (U.K) అక్రిడియేషన్ కమిటీ ఇవన్నీ పరిశీలించి, ముఖ్యంగా జూ సందర్శకుల సంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకుని సర్టిఫికేషన్ ప్రదానం కోసం అప్రూవల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు పని చేసిన సిబ్బంది యొక్క నిబద్ధత, పాటించిన శుభ్రతా చర్యలు చాలా హర్షణీయమని కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, ISO సర్టిఫికేషన్‌ పొందిన మొట్ట మొదటి జూ దేశంలోనే నెహ్రు జూలాజికల్ పార్కు కావటం గర్వకారణమని మంత్రి అన్నారు.

సర్టిఫికేషన్ ప్రదాన కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జూ డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటీ, జూ క్యూరేటర్ ఎన్. క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నిటీ డాక్టర్ ఎం.ఏ. హకీమ్, సర్టిఫైడ్ ఆడిటర్ HYM ఇంటర్నేషనల్ శివయ్య ఆలపాటి పాల్గొన్నారు.

- Advertisement -