జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

14
- Advertisement -

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

2025 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురాలు మారం పవిత్రకు అవార్డు లభించింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు పవిత్ర.

అవార్డు గ్రహీతకు జాతీయ అవార్డుతో పాటు సిల్వర్‌ మెడల్‌, రూ. 50 వేల నగదు బహుమానం అందించనున్నారు. ఏపీ నుంచి ప్రొఫెసర్ జె. విజయలక్ష్మి (స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటె క్చర్, విజయవాడ), డాక్టర్ మెండా దేవానంద కుమార్ (డాక్టర్ లాకిరెడ్డి హన్మిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మైలవరం) ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు దక్కించుకున్నారు.

తెలంగాణ నుంచి ప్రొఫెసర్ సాంకేత్ గోయల్ (బిట్స్ పిలాని, హైదరాబాద్), ప్రొఫెసర్ వినీత్ ఎన్బీ (ఐఐటీ హైదరాబాద్)తో పాటు దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కించుకున్నారు.

Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం

- Advertisement -