నర్సంపేట బంద్‌..

60
narsampet
- Advertisement -

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థులు నిర్వహించిన ఆందోళనలో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ మృతిచెందిన సంగతి తెలిసిందే. రాకేశ్‌ మృతికి నిరసనగా ఇవాళ నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉదయం 9 గంటలకు వరంగల్‌ నుంచి ర్యాలీగా నర్సంపేటకు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తారు.రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు.

కాల్పుల ఘటనలో మృతి చెందిన దామెర రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి వారి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.

- Advertisement -