అన్నివర్గాలను అణగదొక్కుతున్న మోడీ: వినయ్ భాస్కర్

25
bhasker
- Advertisement -

మోదీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్‌ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని…కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాకేశ్‌ మరణం ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ బిడ్లను సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నదని వెల్లడించారు. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలని…ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -