పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం…

125
puducherry
- Advertisement -

పుదుచ్చేరి అసెంబ్లీలో సోమ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి విఫలమయ్యారు. త‌న మెజార్టీ నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌ం కావడంతతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మెజార్టీ నిరూపించుకోవ‌డానికి 14 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా.. కాంగ్రెస్ ద‌గ్గ‌ర 12 మంది స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉంది. దీంతో విశ్వాస పరీక్షలో నారాయణస్వామి విఫలం కాగా తన రాజీనామాను లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాజీనామా అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మాజీ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీపై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. త‌న ప్ర‌భుత్వాన్నిప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌తిప‌క్షంతో చేతులు క‌లిపిన‌ట్లు విమ‌ర్శించారు.

- Advertisement -