- Advertisement -
మొంథా తుఫాను తీవ్రతపై ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షించారు మంత్రి నారా లోకేశ్. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు లోకేశ్. ఏ ప్రాంతంలో తుఫాను తీరం దాటుతుందో అధికారుల వద్ద ఆరా తీశారు.
నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు లోకేశ్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేశారు.
Also Read:రామ్ పోతినేని..సాంగ్ అప్డేట్
- Advertisement -

