అన్ని కుదిరితే అక్కినేని వారబ్బాయి అఖిల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీవీకే సంస్థల అధినేత జీవీకే మనవరాలు శ్రీయా భూపాల్ పెళ్లి ఈ పాటికే అయిపోయేది కానీ.. కారణాలు ఏవైనా వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అఖిల్ను పెళ్లి చేసుకోవాల్సిన శ్రీయా భూపాల్ ఇప్పుడు మరో పారిశ్రామిక వేత్త వారసుడిని పెళ్లిచేసుకోబోతోంది.
అఖిల్ను కాదనుకుని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోబోతోందా.. ఎవరబ్బా అతను అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు అనుకుంటున్నట్లు ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు.. ఆ వ్యక్తి దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థలైన అపోలో గ్రూప్ సంస్థల ఏకైక వారసున్నే పెళ్లి చేసుకోబోతోంది. ఆయన పేరు ఐంద్రీత్.. ఐంద్రీత్ మెగా కోడలు కొణిదెల ఉపాసన పిన్ని కొడుకు. శ్రీయా భూపాల్ – ఐంద్రీత్ల ఎంగేజ్ మెంట్ ప్రాన్స్ రాజధాని పారిస్కు దగ్గరలో ఉన్న ఒక పురాతన ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి సినీ పరిశ్రమలో అతిరథ మహారదులు హాజరయ్యారు.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించే. నమ్రత తన ముద్దుల కూతురు సితారతో కలిసి ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొంది. ఉపాసనకు నమ్రత మంచి ఫ్రెండ్ కాబట్టి ఈ పెళ్లి వేడుకలో నమ్రత అక్కడున్నవారందరితో ఫోటోలు దిగి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.