టాలీవుడ్ ముచ్చట్లు..అల్లు అరవింద్‌కి నాగ్‌ ఆర్థికసాయం..!

321
allu aravind nagarjuna
- Advertisement -

ప్రస్తుతం టీ టౌన్‌లో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అఖిల్ నాలుగో సినిమాగా వస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ నిర్మిస్తుండగా దీనిలో నాగ్‌కు కూడా పెట్టుబడి పెడుతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

చాలాకాలం తర్వాత మళ్లీ మెగా పోన్ పట్టిన బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చవుతుండటంతో అంత బడ్జెట్ పెట్టేందుకు సిద్ధంగా లేనని అల్లు అరవింద్ చెప్పేశాడట.

దీంతో కొడుకు సినిమాను గట్టెక్కించేందుకు రంగంలోకి నాగార్జున దిగారని టీ టౌన్ వర్గాల టాక్‌. అఖిల్ తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ నెక్ట్స్ సినిమాలో క్వాలిటీ తగ్గితే అదొక మైనస్ పాయింట్ అవుతుందని భావించిన నాగ్ మేకింగ్ విషయంలో రాజీ పడొద్దని తాను సహ నిర్మాతగా ఉంటానని అల్లు అరవింద్‌కి చెప్పాడట.

ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాకి తొలుత దేవీ శ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా అనుకున్న ఫైనల్ గా గోపిసుందర్ ని కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -