కత్తి మహేష్ పని పడతామన్న నాగబాబు..

263
naga babu
- Advertisement -

కోట్లాది మంది ఆరాధిస్తున్న శ్రీరాముడిపై సినీవిశ్లేషకుడు కత్తి మహేష్ ఓ టీవీ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, హిందువులు మండిపడుతున్నారు. పలు ప్రాంతాలలో ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. హిందువుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

naga-babu-kathi mahesh

రామాయణం అనేది ఒక పుస్తకమో, కథనో కాదని.. కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి చరిత్ర, హిందువుల ధర్మం అని అన్నారు. ఒక మతానికి సంబంధించిన ఆచారాలపై, ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో.. హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివి అని చెప్పారు.

హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే.. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఒక పద్దతి ప్రకారం హిందూమతంపై, హిందూ దేవుళ్లపై దాడి జరుగుతోందని చెప్పారు. హిందువులను కించపరిచే వారు తగిన శిక్ష అనుభవిస్తారని అన్నారు. వెంటనే కత్తి మహేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.

కత్తిని గాలికి వదిలేయకండి:పరిపూర్ణానంద

బాబుకి జైకొట్టిన కత్తి..

- Advertisement -