‘కత్తి’ని గాలికి వదిలేయకండి:పరిపూర్ణానంద

233
swamy paripurnananda
- Advertisement -

కేబీహెచ్‏బీ పోలీస్ స్టేషన్‏లో కత్తి మహేష్ పై కేసు నమోదు అయింది. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హిందూ జనశక్తి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్వామి ప‌రిపూర్ణానంద స్పందించారు. హిందూ దేవుళ్లపై, ఆచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై రేపటిలోగా చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చ‌రించారు. లేనిపక్షంలో దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని సూచించారు. కత్తి మహేష్ కి శిక్షపడేలా రోడ్డెక్కుతాం అంటూ హెచ్చరించారు.

Kathi mahesh

కోట్లాది మంది ఆరాదిస్తున్న రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. హిందువుల మనసులను గాయపర్చారన్నారు. ఇలాంటి వారిని ఇలాగే వదిలేస్తే.. దుష్పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా సంచలనం చేస్తానని అంటున్నాడు. ఇలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. భారత్ లో అనేక మతాల వారు జీవిస్తున్నారని, వారి మతవిశ్వాసాలకు, ఆచారాలను విమ‌ర్శిస్తే ఎవ్వడైనా సరే.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని సూచించారు.

- Advertisement -