దేశ్యాప్తంగా గో మాంసంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. గోమాంసం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది గోమాంసంపై నిషేధం విధించాలంటుండగా మరికొంతమంది ఎవరి ఇష్టం వారిది అంటూ తమ వాదన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సున్నితమైన ఈ వివాదంపై సినీ హీరోలతో పాటు పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున- అమల జంట చేరింది. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ పేరుతో ఉన్న పోస్టర్ పట్టుకున్న నాగ్, అమల దంపతుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆవును ప్రేమిద్దాం అంటూ గో మాంసంపై నిషేధం విధించాలంటూ నాగ్ పట్టుకున్న పోస్టర్ ట్రెండ్గా మారింది.
అయితే సడన్గా నాగ్ ఆవు మీద ఇంత ప్రేమించడం చూపించడం వెనుక లోగుట్టు ఉందంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఎందుకంటే మోడీ పీఎం అయిన దగ్గరి నుంచి ఆయన్ని అవకాశం వచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉన్నారు నాగ్. ఇందులో భాగంగానే టీడీపీ,బీజేపీకి దగ్గరయ్యేందుకు నాగ్ ఈ కొత్త పల్లవి అందుకున్నారని కామెంట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా గోమాంసంపై దుమారం చెలరేగుతున్న సమయంలో నాగ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా మోడీని,బీజేపీ నేతలను ఇంప్రెస్ చేసేందుకే లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ను ఎంచుకున్నారని మరికొంతమంది చెబుతున్నారు.
నాగార్జున సహకారంతో అమల బ్లూక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా జంతువులను సంరక్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విషయం తెలిసిందే. ది బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సంస్థ చేసిన సేవలకు గాను యానిమల్ వెల్ ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా దక్కింది. బ్లూ క్రాస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేంది కుక్కలు. ఎందుకంటే అమలకు కుక్కల మీద ప్రత్యేక శ్రద్ద.