- Advertisement -
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో విజయం సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 205 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 పరుగులు చేయగా , నమన్ ధీర్ 24 బంతుల్లో 46 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేష్, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకముందు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) ,ఆయూష్ బదోనీ (30) పరుగులు చేయగా హార్దిక్ పాండ్య 5 వికెట్లు తీశాడు.
Also Read:KTR: రాహుల్ చేతికే ఆ రక్తపు మరకలు
- Advertisement -

