నేతాజీ ములాయం ఇకలేరు

56
akhilesh
- Advertisement -

మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం కన్నుమూశారు. కిడ్నీ, యూరిన్, శ్వాస కోసం సమస్యలతో బాధపడుతున్న ములాయం గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఇటీవలె చేరారు.

ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా పరిస్ధితి మరింత విషమించడంతో మృతిచెందారు. పార్టీ నేతలు నేతాజీగా పిలుచుకునే ములాయం ఇకలేరు అన్న వార్తతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

ములాయం సింగ్ యాదవ్, నవంబర్ 22, 1939 న జన్మించారు. మూడు సార్లు యూపీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం అజంగఢ్‌ ఎంపీగా ఉన్న ములాయం..దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.

- Advertisement -