ధోనీ మరోసారి.. ఇలా !

317
MS Dhoni sleeps on the ground during match
- Advertisement -

భారత్‌-ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్‌లో చెన్నైలో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో ధోనీ మరోసారి పడుకొని వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి గ్రౌండ్‌లో కాదు.. ఎయిర్‌పోర్టులో.. కోల్‌క‌తాకి వెళ్లే క్ర‌మంలో చెన్నై ఎయిర్‌పోర్టుకి టీమిండియా ఆట‌గాళ్లంతా వ‌చ్చారు. విమానం ఆలస్యం కావడంతో ఎదురు చూస్తూ ఇలా ఎయిర్‌పోర్టు ఫ్లోరులోనే కూర్చుండిపోయారు. టీమిండియా మిగ‌తా ఆట‌గాళ్లంతా ఫ్లోరుపై కూర్చుంటే ధోనీ మాత్రం ప‌డుకున్నాడు.

MS Dhoni spotted lying on floor at Chennai airport

ధోనీ రైల్వే స్టేష‌న్‌లో ఉన్నాడ‌ని అనుకుంటున్నాడేమో అని ఒక‌రు, ధోనీకి నిద్ర‌పోవ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ని మ‌రొక‌రు, ధోనీ హిప్నాటిజం చేస్తూ రిలాక్స్ అవుతాడేమోనని ఇంకొకరు ఇలా ఎవ‌రికి తోచిన‌ట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, భారత్‌ – శ్రీలంకల మధ్య మూడో వన్డే మ్యాచ్‌ జరుగుతోన్న‌ సమయంలో మహేంద్ర సింగ్‌ ధోనీ మైదానంలో నిద్రపోయి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

- Advertisement -