శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్..

326
trivikram tirumala
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. అరవిందసమేత చిత్రం విజయవంతం అయిన సందర్భంగా స్వామివారికి మ్రొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు త్రివిక్రమ్ పేర్కొన్నారు. సినిమాను ఆదరించి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు త్రివిక్రమ్.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే వందకోట్ల షేర్ రాబట్టి సత్తాచాటింది. ఇప్పటివరకు 150 కోట్ల షేర్‌ని రాబట్టిన అరవింద సమేత ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. యూఎస్‌లో ఎన్టీఆర్ గత సినిమాల రికార్డులను తిరగరాసింది.

- Advertisement -