బర్త్ డే…మొక్కలు నాటిన ఎంపీ సురేశ్ రెడ్డి

154
suresh reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి గారు బంజారా హిల్స్ లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన ప్రాంత ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తన మనుమరాల్లతో కలిసి మొక్కలు నాటారు.

- Advertisement -