MP Santhosh Kumar:రన్‌ ఫర్ పీస్

34
- Advertisement -

అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రన్ ఫర్ పీస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రన్ ఫర్ పీస్‌ని ప్రారంభించనున్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన టీ షర్ట్‌ని ఆవిష్కరించారు.

అక్టోబర్ 2న కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లో ఉదయం 6 గంటలకు 10K, 5K, 3K కార్యక్రమం జరగనుంది. ఇంతమంచి కార్యక్రమాన్ని చేపట్టిన బొటానికల్ గార్డెన్ వాకర్స అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, సెక్రటరీ బాలకిషన్‌ రావులను అభినందించారు ఎంపీ సంతోష్. అందరం కలిసి మహాత్మ గాంధీ జయంతి రోజున ఐక్యత కోసం పరుగు తీద్దామన్నారు.

Also Read:మైనంపల్లి ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు బిగ్ షాక్?

గత మూడు సంవత్సరాల నుండి బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా గతేడాది తన రాజ్యసభ నిధుల నుండి గార్డెన్‌లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10 లోలు కేటాయించారు సంతోష్ కుమార్.

- Advertisement -