14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..

413
- Advertisement -

ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో… ప్రారంభోత్సవం,యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనం లో చేపట్టవలసిన మరమ్మత్తులు,కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తో కలిసి పరిశీలించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -