పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు..

203
- Advertisement -

ఏడాది ఏడాదికి పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ సహాయమంత్రి వి.మురళీధరన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఈ ఏడాది అక్టోబర్ వరకు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య 1.83 లక్షలుకు చేరిందన్నారు. గత ఏడాది 1.63 లక్షల మంది సిటిజెన్ షిప్ ను వదులుకున్నారని చెప్పారు. గడచిన సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పారు.

2021 లో 1.63 లక్షల మంది… 2020లో 85 వేల మంది… 2019లో 1.44 లక్షల మంది… 2018లో 1.34 లక్షల మంది… 2017లో 1.33 లక్షల మంది… 2016లో 1.41 లక్షల మంది… 2015లో 1.31 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -