గ్రీన్‌ఛాలెంజ్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ..

150
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమంలా సాగుతోంది. సంతోష్ కుమార్ హరిత సవాల్ ను ఢిల్లీ బిజెపి ఎంపీ మనోజ్ తివారీ స్వీకరించారు. ఈ మేరకు ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు.

- Advertisement -