సుస్థిర అభివృద్ధి కోసం పనిచేయండి : ఎంపీ కవిత

227
kavitha mp
- Advertisement -

సుస్థిర అభివృద్ధి కోసం అందరు కృషిచేయాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో పాల్గొన్న కవిత ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని తెలిపారు.

ప్రపంచంలో ఏటా 22 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని తెలిపారు. సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉందని… మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి అని కవిత స్పష్టం చేశారు.

ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు సామాజిక కార్యకర్త అన్న హజారే. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు.

ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. నేడు సదస్సులో యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టి చేపట్టారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపీ గౌరవ్ గగోయ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, నిజామాబాద్ ఎంపీ కవిత వ్యవహరిస్తున్నారు.

- Advertisement -