Covid:మూడు వేలకు చేరువలో కరోనా కేసులు…

50
- Advertisement -

దేశంలో కరోనా రోజురోజు విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం గడిచిన 24గంటల్లో 1,43,364మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో కొత్తగా 2,994కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 16వేల మార్క్‌ను దాటి 16354కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 24గంటల్లో ఐదుగురు మృతి చెందారు. దీంతో కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876 కాగా కోలుకున్న వారి సంఖ్య 4,41,71,551 గా నమోదయ్యాయి. ఇప్పటివరకు రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 (220,66,09,015) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి…

Gas:స్వల్ఫంగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌.!

ఆటా ఉగాది సాహిత్య వేదిక..

Fish Oil:చేపనూనె తీసుకుంటే ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -