- Advertisement -
ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. శాంతి, సంభాషణలకు భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను అభినందించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న భయంకరమైన యుద్ధం ముగియడానికి భారత్ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దౌత్యాన్ని బలోపేతం చేసే ప్రతి నిర్ణయం భద్రతను మెరుగుపరుస్తుందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

