రామమందిర నిర్మాణానికి మోడీ భూమిపూజ..

251
ram mandir
- Advertisement -

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అంతకముందు రామ్‌ల‌ల్లా ఆల‌యానికి చేరుకున్న మోదీ తొలుత సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న శ్రీరాముడికి పువ్వుల‌తో పూజ స‌మ‌ర్పించారు. సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మోదీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పారిజాత మొక్కను నాటారు.

పారిజాతను దైవ సంబంధమైన మొక్కగా హిందువులు భావిస్తారు. భారతీయ ఇతిహాసాల్లో పారిజాత మొక్క విశిష్ఠత గురించి అనేక కథనాలున్నాయి.

- Advertisement -