శ్రీను వైట్ల ఛాలెంజ్‌ని స్వీకరించిన ఎంపీ రంజిత్ రెడ్డి

348
ranjith reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటిన చేవెళ్ల ఎం.పి రంజిత్ రెడ్డి….అడవులు అన్ని హరించి పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు మాత్రం హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారు.

ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల కలిపి దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ డైరెక్టర్ శ్రీను వైట్ల నాకు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ ఎం.పి , ఎం.ఎల్.ఏ కాలనీ లోని నివాసంలో లో మొక్కలు నాటిన చేవెళ్ల ఎం.పి రంజిత్ రెడ్డి.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నానని తెలిపారు.అనంతరం ( కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ , తన సహచర ఎం.పిలు జేజస్స్వి సూర్య , అసదుద్దీన్ ఒవైసీ , మిమి చక్రవర్తి , శశిథరూర్ , గల్లా జయదేవ్ , క్రికెట్ ప్లేయర్ గౌతమ్ గంబీర్ ) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటి మరికొంత మందికి ఛాలెంజ్ విసరాలని కోరుతున్నానని ఎం.పి రంజిత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -