బీసీ బిల్లు.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: కవిత

1
- Advertisement -

రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలి అన్నారు.

బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీ ఒత్తిడి తేవాలి అని.. కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలింది అన్నారు. కాంగ్రెస్ చేసిన కుల సర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభాను పెంచారు.. గ్రామాల వారీగా కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.

డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు ?.. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఇంత వరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు ? అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కానీ మా పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసింది అన్నారు.

Also Read:రాష్ట్రంలో రాక్షస పాలన: ప్రవీణ్ కుమార్

పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు లక్షా 55 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం.. కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంత మంది ఎగతాళి చేశారు కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నాం, బీసీ నాయకత్వం బలపడడానికి ఐదుగురిని రాజ్యసభకు, 8 మందికి ఎమ్మెల్సీ,58 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఇచ్చాము అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది.. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవీ ఎప్పడూ బీసీ బిడ్డలకు దక్కలేదు,మొట్టమొదటి సారికి రవీందర్ యాదవ్ ను కేసీఆర్ వీసీ చేశారు.. అడ్వొకేట్ జనరల్ గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ ది అన్నారు.

- Advertisement -