చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

67
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. తొలుత నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొంటారు..

ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్‌, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పాల్గొననున్నారు.

బీఆర్‌ఎస్‌ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతతోపాటు తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ గురించి తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -