SSC Exams:విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్

43
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరిక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత.ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని మంత్రి సబితా సూచించారు.

జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలోని 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం వారే కావడం విశేషం. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -