‘అక్షరయాన్’ వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత..

141
kavitha
- Advertisement -

మహిళలపై జరుగుతున్న వేధింపులపై, అక్షరాలే ఆయుధాలుగా, తమ రచనల ద్వారా సమాజంలో మార్పునకై పాటుపడుతున్న ‘అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరమ్’ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ‘తెలుగు మహిళా రచయితల ఫోరం-అక్షరయాన్’ కు చెందిన 25 మంది రచయిత్రిలు, ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను హైదరాబాదు లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ ‘https://aksharayan.org’ వెబ్ సైట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వెబ్ సైట్ రూపకర్తలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

“తమిరిశ జానకి కవితల పోటీ”లో గెలుపొందిన రచయిత్రిలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందజేశారు. అంతేకాదు పలు నూతన పుస్తకాలను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, వేణుగోపాలాచారి, పలువురు రచయిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -