ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ 274/5

174
India vs Australia
- Advertisement -

ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 87 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌(28; 70 బంతుల్లో 3×4), కెప్టెన్‌ టిమ్‌పైన్‌(38; 62 బంతుల్లో 5×4) క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఆట ఆరంభంలోనే ఆసీస్ వడివడిగా రెండు వికెట్లు కోల్పోయింది. 17 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (1), మార్కస్ హారిస్ (5) పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత మార్నస్ లబుషానే (108) సెంచరీ సాధించడం హైలైట్ గా నిలిచింది. లబుషానే 9 ఫోర్లు కొట్టాడు. అయితే, తొలి టెస్టు ఆడుతున్న నటరాజన్ బౌలింగ్ లో బంతి బౌన్స్ ను అంచనా వేయడంలో పొరబడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 36 పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 45 పరుగులు నమోదు చేశాడు. ఇక భారత బౌలర్లలో నటరాజన్‌ 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ తీశారు.

- Advertisement -