కొల్లాపూర్‌కు మంత్రి కేటీఆర్‌

22
Minister ktr
- Advertisement -

ఇవాళ మంత్రి కేటీఆర్ నాగర్‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాజాగారి బంగ్లా ముందు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం నాగర్ కర్నూల్ చేరుకుంటారు. మినీ టాంక్ బండ్, మిషన్ భగీరథ పైలాన్, ఆడిటోరియం, వెజ్-నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన మున్సిపల్ బిల్డింగ్ను ప్రారంభిస్తారు. అనంతరం బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

- Advertisement -