టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు కరోనా..

126
shanker naik
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారీన పడ్డారు. మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. తనతో కొద్దిరోజులుగా కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారెంటైన్ లోకి వెళ్లాలని కోరారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 5గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,50,331కు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 1377 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,890 యాక్టివ్ కేసులుండగా 17,135 హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

- Advertisement -