కేంద్రం తీరుకు నిరసనగా కోటిసంతకాల సేకరణ..

108
mla sandra
- Advertisement -

యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. మీడియాతో మాట్లాడిన సండ్ర….కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు… అదే విదంగా రాష్ట్రంలో కూడా రైతులు ఆందోళన లు చేయాలన్నారు.

7 సంవత్సరాల మోడీ ప్రభుత్వం లో ఒక్క ఎఫ్సిఐ గోదాం నిర్మించలేదు అంటే ఈ ఎఫ్సిఐ ని కూడా ప్రైవేట్ చేస్తారేమో అని అనిపిస్తుందన్నారు. ఢిల్లీలో రైతుల మాదిరిగానే తెలంగాణ రైతాంగం నిరసనలు చేయాలని తెలిపారు.

గత 4,5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం పై విమర్శించమా… ఎందుకు ఇప్పుడే ఇలా చేస్తున్నాము అంటే రైతులను అయోమయంలో పడేశారు కాబట్టి చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం దిగొచ్చేవరకు రైతులు పోరాటం చేయాలన్నారు.

- Advertisement -